మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఐటీడీఏ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా ఐటీడీఏ పీవో అంకిత్ ఐఏఎస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఐటిడిఎపిఓ అంకిత్ మాట్లాడుతూ.ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలలను నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏవో దామోదర స్వామి,మేనేజర్ శ్రీనివాస్,ఐటీడీఏ వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: