మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో తెరాస మండల పార్టీ అధ్యక్షులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతిని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మండల పార్టీ అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చూపించిన అహింసా మార్గంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సారథ్యంలో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని, జయశంకర్ సార్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నెరవేర్చడం కొరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బంగారు తెలంగాణ సహకారం కొరకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కొరకు దృఢ సంకల్పంతో పని చేస్తున్న మహోన్నతమైన వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని,జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించడం మన అందరి బాధ్యత అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలియావబీ సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు,వైఎస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు,అల్లి సుమలత శ్రీనివాస్,పర్వతాల భరత్,జాడి లక్ష్మీనారాయణ, కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సప్పిడి రామ నరసయ్య,మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు వావిలాల రాంబాబు,బట్టు రమేష్,గార ఆనంద్,కొండాయి చిన్ని,కాళ్ల రామకృష్ణ,చిన్నికృష్ణ,వావిలాల ముత్తయ్య,వావిలాల పోచయ్య,కతా యాదగిరి, ఎండి అబిద్,కందకట్ల శ్రీనివాస్, తాళ్లపల్లి మోహన్,పాలకుర్తి విజయ్,పరికి వేణు,అల్లి మల్లయ్య తెరాస పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: