మన్యం టీవీ దుమ్ముగూడెం ::
మండలంలోని వరద ప్రభావిత గ్రామాలను రాష్ట్ర ఆర్టిఐ కమిషనర్ డా.గుగులోతు శంకర్ నాయక్ సందర్శించారు అనంతరం గంగోల్ డబుల్ బెడ్ రూమ్ కాలనీ ఎస్సీ కాలనీ సున్నం బట్టి గ్రామంలో సేవ ఫౌండేషన్ కన్వీనర్ రవి నాయక్ ఆధ్వర్యంలో 160 మంది వరద బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు బాధితులను ఆదుకోవాలని కోరారు ముంపు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు అనంతరం కే రేగుపల్లి ఆశ్రమ పాఠశాల సందర్శించి పిల్లలకు అందుతున్న మెనూ గురించి తెలుసుకొని పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ ఐటిడిఎస్పోర్ట్స్ ఆఫీసర్ వీరు నాయక్ ఎస్సై రవికుమార్ ఎంపీ ఓ ముత్యాలరావు గిర్ధవర్లు ఆదినారాయణ, లక్ష్మయ్య, తెరాస మండల అధ్యక్షుడు సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి కనితి రాముడు ఎంపిటిసిలు తిరుపతిరావు రామారావు సర్పంచ్ తెల్లం రామకృష్ణ, లక్ష్మి, టిఆర్ఎస్ నాయకులు కెల్లా శేఖర్ జుంజూరి జయసింహ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: