మన్యం మనుగడ, అశ్వారావుపేట: సైబర్ నేరాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అంటూ స్థానిక ఎస్సై చల్లా అరుణ ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. అశ్వరావుపేట పాత ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పాత పద్ధతుల్లో తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేసిన దొంగలను పట్టుకోవడం తేలికైన పనేనని, ఈ మధ్యకాలంలో జరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించలేకపోతున్నామని, ప్రజలందరూ అవగాహన కలిగి ఉంటే వీటిని నివారించవచ్చని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై చల్లా అరుణ సూచించారు. బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాము ఓటిపి చెప్పాలని, లేనిచో మీ ఎకౌంటు నిలిపివేయబడుతుందని మాయ మాటలతో డబ్బులు కాజేస్తున్నారని, ఫోన్ కి కొన్ని యుఆర్ఎల్ లింకులు పంపించి ఓపెన్ చేయమని కాల్ చేసి ఎకౌంట్లు ఖాళీ చేస్తున్నారని, కొన్ని అశ్లీల వీడియో కాల్స్ ద్వారా, లోను యాప్స్ ద్వారా, ఆన్లైన్ ఉద్యోగాల పేరిట, ప్రజల వద్ద నుండి విచ్చలవిడిగా డబ్బులు గుంజుతున్నారని వీటి ఎడల అప్రమత్తంగా లేకపోతే భారీగా నష్టపోవడం ఖాయమని తెలియజేశారు. లోని యాప్ ద్వారా ఐదు నిమిషాల్లో లోన్ ఇస్తామని ఈ మధ్యకాలంలో మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయని వీటిని నమ్మవద్దని, ఇంకా అనేక రూపాలలో మీ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు గుంజేందుకు నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయని, వీటిని మీరు గ్రహించి, అనుమానం కలిగినప్పుడు 1930 నెంబర్ కు కాల్ చేయాలని ఈ నెంబర్ కేవలం సైబర్ నేరాలను అరికట్టడానికి ఏర్పాటు చేయబడిందని, ఈ నెంబర్కు ఫోన్ చేయగానే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము బదిలీ కాకుండా ఆపివేయబడుతుందని, ఏమాత్రం అనుమానం కలిగిన వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: