గుండాల ఆగస్టు 18(మన్యం మనుగడ) మండలంలోని ఆర్ఎంపీ వైద్యులు తమ పరిధికి మించి వైద్యం చేయవద్దని జిల్లా మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో స్థానిక ఆర్ఎంపి వైద్యులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదైతే వెంటనే ప్రభుత్వ వైద్యశాల సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు రవిచంద్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ఆర్ఎంపి వైద్యులు పాల్గొన్నారు
Post A Comment: