అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు...
మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా ఉండేది టిఆర్ఎస్ పార్టీ ఒకటేనని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు అన్నారు. గురువారం అశ్వారావుపేటలో జరిగిన కార్యక్రమంలో చండ్రుగొండ మండలానికి చెందిన 13 మంది బాధిత కుంటుంబాలకు తెరాస మండల ప్రధానకార్యదర్శి ఉప్పతల ఏడుకొండలతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పేదలకు అండగా ఉండాలనే ఉన్నతలక్ష్యంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసి, అందజేసేలా చేస్తున్నాడన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతి రమేష్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: