మన్యం టీవీ చర్ల :
చర్ల మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బషీరాబాద్ అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. 2000 సంవత్సరం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పెంచినటువంటి విద్యుత్ చార్జీలు తగ్గించాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించి బస్వ వాయు కార్యకర్తలపై ప్రయోగించి కాల్పులు జరిపిస్తే రామకృష్ణ .బాలసాని .విష్ణువర్ధన్ రెడ్డి కాల్పుల్లో చనిపోయారు కనుక అమరవీరుల ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాలని మండల నాయకులు బందెల చంటి అన్నారు ఈ కార్యక్రమంలో కోటి ముత్యాలరావు ఊడుగుల షారోన్ మంగమ్మ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: