మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రవికంపాడు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భూపతి రమేష్ స్పష్టం చేశారు. ఆదివారం రవికంపాడు గ్రామంలో గ్రామానికి ఆసరా పింఛన్లు మంజూరి చేసినందుకు గాను టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... 57 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఒంటరి, వితంతువులకు సైతం ఇవ్వడాన్ని ప్రభుత్వానికి శుభసూచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు, పంచాయతీ ఉపసర్పంచ్ పోతురాజు వెంకటేశ్వర్లు, ఎస్ఎంసి చైర్మన్ సుంకు వెంకటేశ్వర్లు, డోజర్ నరసింహారావు, మంచినీళ్ల వెంకటేశ్వర్లు, ఎండి సలీం, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: