భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజక వర్గంలో ఈ సారి గెలుపు తలుపు, ఎవరిదో... మారుతున్నా రాజకీయ సమీకరణాలు,ఈసారి రాబోయే శాసన సభ ఎలక్షన్ లో తెలంగాణా గుమ్మం గా పేరొందిన అశ్వారావుపేట నియోజకవర్గం ఎప్పటికి ప్రత్యేకమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణాలో ఉన్నప్పటి నుంచి అశ్వారావుపేట నియోజకవర్గం పవర్ లో ఉంది అధికార పార్టీ నా లేక, ఏ పార్టీ అని చూడని ఓటర్ మహాసేయులు ఎవరు గెలుస్తారు అనేది అంతుపట్టని ప్రశ్న, ఇప్పటికి అధికారం లో ఉన్న తెరాస పార్టీ ఇప్పటికి ఇక్కడ ఒక్కసారి కూడా అశ్వారావుపేట స్థానాన్ని గెలుచుకోలేకపోయింది, 2014 లో వైస్సార్సీపీ నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు ఎంఎల్ఏ గా గెలుపొందారు. 2018 మిత్రపక్షల సాయం తో పోటీలో నిలిచి ఎంఎల్ఏ గా గెలిచిన మెచ్చా నాగేశ్వరావు, ఇలా గెలిచిన వారు అభివృద్ధి కోసం అధికార పార్టీ లోకి రావడం జరిగింది, రాబోవు శాసన సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ప్రశ్నర్ధకంగా మారింది వివిధ పార్టీలనుంచి అధికార పార్టీ లోకి, అధికార పార్టీ నుంచి ఆఖర్షిత పార్టీల లోకి నాయకులు మారటం, మారుతుండటం వివిధ పార్టీల అధిష్టానలకు తలనొప్పిగా మారింది, ఈసారి రాబోవు ఎలక్షన్ లో బీఎస్పి పార్టీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభావం, మరియు వైస్సార్టీపీ బాస్ షర్మిల ప్రభావం మరియు మొన్నటి దాక తెరాస లో ఉండి కాంగ్రెస్ లోకి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లు ఎన్నికలకు సిద్ధమై తున్నారు, దీనికి తోడు అధికార పార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పార్టీ మారితే ఎవరు గెలుస్తారు అనేది ఊహకు అందని విషయం, బీజేపీ తరపున బలమైన అభ్యర్థి నీ నిలిపి గెలుపు జెండా పట్టాలని బీజేపీ పార్టీ ఆశ, కొంత ప్రభుత్వ వ్యతిరేక తో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనేది ప్రశ్నర్థకామే, అధికార పార్టీనీ గెలిపించి సెంటిమెంట్ నీ మారుస్తారా లేక మేము ఎప్పటికి ప్రత్యేకమే అని తీర్పు ఇస్తారా అని ఎదురు చూడటమే. ఏది ఏమైనా ప్రజల తీర్పు ఎటో? అభిరుద్ది లో వెనక బడిన నియోజకవర్గంను ఆదుకునే పార్టీకె మా మద్దతూ అని కొంతమంది ఓటర్లు బహిరంగాను చర్చించుకోవటం గమనార్హం, అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రం ఐనప్పటికి కోర్ట్ లేకపోవటం, డిగ్రీ కాలేజీ లేకపోవటం, గ్రంధాలయం నిర్వహణ లోపం, ఆర్టీఓ ఆఫీస్ ప్రతి పాదన నలకు పరిమితమవ్వడం, సెంట్రల్ లైటింగ్ లేకపోవడం, మరియు పబ్లిక్ టాయిలెట్స్, స్త్రీల మరుగుదొడ్లు లేకపోవడం, నియోజకవర్గం కేంద్ర అట స్థలము లేకపోవడం, ఏ పార్టీ ఐనా అశ్వారావుపేట నియోజకవర్గంను పటించుకున్న దాకలలు లేవు అని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఈ సారి అభిరుద్ది చేసి చూపించే పార్టీనే గెలిపించెకోవాలి అని విద్య వంతులు, వేశ్లేషకులు, మేధావుల వాదన.
Post A Comment: