మన్యం మనుగడ కరకగూడెం : భారత స్వతంత్ర 75వ వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం కరకగూడెం మండల కేంద్రంలోని కరకగూడెం అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం తహసిల్దార్ ఉషా శారదా ఆధ్వర్యంలో దేశభక్తి పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు,అధికారులు, ప్రజలు,పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నుదు వల్లనే విజయవంతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాస్ ఎస్ఐ నాగబిక్షం,ఎంపీపీ రేగా కాళికా,స్థానిక సర్పంచ్ ఊకే రామనాధం,కార్యదర్శి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: