మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన వడ్డెర సంఘం మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏడుకొండలు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వడ్డెరలకు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం వడ్డెర కులస్తులకు ఇండ్లు మంజూరు చేయాలన్నారు.ఈ సమావేశంలో వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు దండుగుల సాంబశివరావు,ఓర్సు రామకృష్ణ, కుంచపు కన్నయ్య, పెద్దరావు, ఆలకుంట రామదాసు,అయోధ్య,భోపాల్, నరసింహారావు,బత్తుల శీను, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: