మన్యం మనుగడ ఏటూరు నాగారం
కన్నాయి గూడెం మండల కేంద్రంలోని గిరిజన బాలురు ఆశ్రమ ఉన్నత పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించిన ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్,హాస్టల్ లోని సమస్యలను తెలుసుకుంటూ డైనింగ్ హాల్,కిచెన్ షెడ్ డార్మిటరీ భవనాన్ని పరిశీలించారు.అనంతరం
ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరు పట్టికనుపరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడుతూ.నాణ్యమైన భోజనం,మెటీరియల్, పుస్తకాలు మొదలైన వాటిని అందించడంపై విద్యార్థులను
అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్లో వంటశాలను సందర్శించినప్పుడు హాస్టల్ వర్కర్స్ వండుతున్న భోజనాన్ని పరిశీలించారు.
విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, వైద్యబృందం ద్వారా శిబిరాలు నిర్వహించడం,సరిపడా మందుల లభ్యత తదితర అంశాలపై ఆరా తీశారు.
సిక్ రూమ్ ఏర్పాటు,సిసి కెమెరాలు,బయోమెట్రిక్ పరికరాలు,డిజిటల్ క్లాస్ రూమ్,టాయిలెట్లు తదితర వాటి పనితీరుపై ఆరా తీశారు.
గిరిజన సంక్షేమ శాఖ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని,విద్యార్థులను బయటకి అనుమతించవద్దని ఆదేశించారు.
Post A Comment: