- ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్.
మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని కొడిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఏటూరు నాగారం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఐఏఎస్ తనిఖీ చేశారు. ల్యాబ్ ను పరిశీలించి రోజువారి వైద్య పరీక్షల గురించి,తగినన్ని టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. ఫార్మసీ గదిని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్,హెల్త్ సూపర్వైజర్,స్టాప్ నర్స్ తో రోజువారి అవుట్ పేషెంట్లు, రోగులలో వ్యాధులను నివేదించడం,ఆవాసాలలో శిబిరాలు నిర్వహించ
డం మొదలైన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.పీ హెచ్ సీ పరిధిలోని సబ్ సెంటర్ లో ఏఎన్ఎం లో పని తీరిపోయి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.అనంతరం గిరిజన ఆశ్రమం ఉన్నత పాఠశాల ను సందర్శించి, హాస్టల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.సోలార్ వాటర్,హీటర్ ఆర్ వో వాటర్ ప్లాంట్,బయోమెట్రిక్ పరికరాలను వాటి పనితీరుపై స్థానిక వార్డెన్ ను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు,విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
Post A Comment: