మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : ఇంటింటికి దేశభక్తి ఇమ్మడింప చేయాలని జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి అన్నారు.బుధవారం బెండాలపాడు గ్రామపంచాయతీ బాలికుంట గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి వజ్రోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భారతదేశం లౌకికదేశమని అన్ని కులాలు, మతాలు సమానత్వంతో ఉండాలని, దేశభక్తి ప్రతి పౌరుడుకి ఇమిడి ఉండాలని, దేశభక్తి నినాదం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, మండల తహసీల్దార్ వర్ష రవికుమార్,ఎంపీడీవో అన్నపూర్ణ, ఈఆర్డిఓ తులసీరామ్, ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి,సర్పంచ్ పూసం వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ బొర్ర లలిత,ఫారెస్ట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: