మన్యం మనుగడ, దమ్మపేట:75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఐటిడిఏ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఐటిడిఏ పిఓ మరియు డిడి చేతుల మీదుగా ఉత్తమ ప్రదానోపాద్యాయులు గా తోలే వెంకటేశ్వర్లు ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్బంగా 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోలెం వెంకటేశ్వర్లును ప్రశంసా పత్రం అందుకున్న సందర్భంగా ఉపాధ్యాయులు వెంకటరమణ, నాగేంద్రమ్మ, రమణ, శ్యామల, రామక్రిష్ణ, వీరభద్రమ్, శ్రీను, రవి, పాంచాలి, సునీత, పుష్ప, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: