CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐక్యత ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఇటీవల అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐక్యత ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి అయిన జర్నలిస్టులు ప్రజలకు ఉపయోగపడే మంచి వార్తలు అందించాలని వారు సూచించారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి, ఆలపాటి రాము, ముబారక్ బాబా, సత్యవరపు సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.*అదే విధంగా నూతన ప్రెస్ క్లబ్ ను సందర్శించిన అధికారులు ప్రజాప్రతినిధులు* అశ్వారావుపేట లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సందర్శించి ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ ను సందర్శించిన వారిలో ఎక్సైజ్ సీఐ నాగయ్య, ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్, సెక్షన్ ఆఫీసర్ రమేష్, సిపిఎంఎల్ ప్రజాపందా నాయకులు గోకినపల్లి ప్రభాకర్, సిపిఎం నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కో ఆప్షన్ సభ్యులు పాషా, వగ్గెల పూజ, ముల్లగిరి కృష్ణ, బూసి పాండురంగ, మహేష్, దిశ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీటీసీ వేముల భారతి, అబ్దుల్ రెహనా బేగం, ఎంపీటీసీ సత్యవరపు తిరుమల, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, సోదర పాత్రికేయ మిత్రులు చిప్పనపల్లి శ్రీను, మాలోతు రామారావు, కన్నాయిగూడెం సర్పంచ్ గొంది లక్ష్మణరావు, తాపీ వర్కర్స్ యూనియన్ నాయకులు, వార్డ్ మెంబర్ పమిడి లక్ష్మణరావు, ఐక్యత ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: