మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 15. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పి హెచ్ సి, లో యాలం సతీష్ కుమార్ గత 5 సంవత్సరాలగా పర్మాసిస్ట్ గా యెనలేని సేవలు అందించారు. ప్రత్యేకంగా కరోనా వ్యాది ఈ ప్రపంచాన్ని గడగడ లాడించిన ఆ నిర్ణీత కాలంలో రెండు సంవత్సరాలుగా ఆయన సేవలు మరువలేనివి, కష్టేఫలం అనే సామెతల, తన విధి నిర్వహణలో పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉండేందుకే సేవలందించారని, సేవలు సద్వినియోగం చేసుకున్న ప్రజలు తెలిపారు. అతి పిన్న వయసులో యాలం సతీష్ కుమార్, ఫార్మసిస్టు అవార్డు గ్రహీతగా ఐటీడీఏ పీవో అంకిత్ ఈ అవార్డుని అందించారు. వాజేడు మండలానికి పేరూరు పిహెచ్సి సెంటర్ కి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు.
Post A Comment: