మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అశ్వారావుపేట తహసిల్దార్ చల్లా ప్రసాద్ కు అరుదైన గౌరవం లభించింది. అశ్వారావుపేట మండలంలో తహశీల్దార్ చల్లాప్రసాద్ చేసిన సేవలకు గుర్తింపుగా జిల్లాలో ఉత్తమ తహాశీల్దారుగా అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఆగస్టు 15 సందర్భంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలో కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, పినపాక ఎమ్మెల్యే తెలంగాణ విప్ రేగా కాంతారావు, జిల్లా ఎస్పీ వినీత్ జి, జెసి కర్ణాటక వెంకటేశ్వరరావు చేతుల మీదుగా తహసిల్దార్ చల్లాప్రసాద్ అవార్డు అందుకున్నారు. అశ్వారావుపేట మండలానికి అరుదైన గౌరవం లభించడం పట్ల స్థానిక రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Navigation
Post A Comment: