గుండాల ఆగస్టు 20(మన్యం మనుగడ) మండలం పరిధిలోని కొడవటంచ గ్రామ సమీపంలో గల కిన్నెరసాని వాగు వద్ద ఉన్న బండల సందులలో ఇరుక్కొని దుక్కిటేద్దు మృతి చెందింది. కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం సురేష్ ఎద్దు వాగు దాటుతుండగా మండల సందులలో ఇరుక్కుపోయింది ప్రవాహం ఎక్కువ ఉండటంతో ఎద్దు మృత్యువాత పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రక్షించే లోపే ఎద్దు మృతి చెందింది. విషయం తెలుసుకున్న వెటర్నరీ అసిస్టెంట్ హరి కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పేర్కొన్న ప్రకారం ఎద్దు విలువ సుమారు 40 వేల వరకు ఉంటుందని ప్రభుత్వమే సురేష్ ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు
Navigation
Post A Comment: