మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ఆరోగ్య తెలంగాణయే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో మండలానికి కేటాయించిన నూతన 108 వాహనాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పాత 108 వాహనం వల్ల తరచూ మరమ్మత్తులతో ఇబ్బందులు జరిగాయని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా నూతన వాహనం మంజూరైందన్నారు. ఏజెన్సీ ప్రాంత ఆరోగ్య సమస్యలను గుర్తించి వాహనాన్ని కేటాయించిన ఉన్నత అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రకాష్, ప్రవీణ్కుమార్, జడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, భూక్యరాజి, ఎంపీడీవో అన్నపూర్ణ, తహసిల్దార్ వర్షా రవికుమార్, ఎంఈఓ సత్యనారాయణ, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీను, టిఆర్ఎస్ జిల్లా నాయకులు భోజ్య నాయక్, టిఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ఉప్పతల గణేష్, కాంగ్రెస్ నాయకులు కేశబోయిన నరసింహారావు, కొందుమూరి దయాకర్ రావు, బోర్ర సురేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: