మన్యం మనుగడ కరకగూడెం:ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పూరస్కారించుకోని మండల వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజన గ్రామాలలో ఆదివాసీ జెండాలను ఎగురవేశారు. చిరుమళ్ళలో సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం.నర్సింహరావు, రఘునాధపాలెంలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన నర్సింహరావు,వివిధ గ్రామలలో ఆదివాసీ పెద్దలు యువత పాల్గొని ఆదివాసీ జెండాలను ఎగురవేశారు.అలాగే ములుగు ఎమ్మెల్యే దనసరి సితక్క కుమారుడు దనసరి సూర్య మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని విరపూరం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కొమరం భీమ్ విగ్రహాన్ని కి పూలమాలలు వేసి ,ఆదివాసీ యువతకు ప్రజలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, ఆదివాసీ యువత చుట్టుబాక.గణేష్, చందా.రామకృష్ణ,చర్ప.సాంబశివరావు,యువతి, యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: