మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలో 75వ స్వాతంత్ర వారోత్సవాలలో భాగంగా సర్పంచ్ కలపాల దుర్గయ్య ఆధ్వర్యంలో గుర్రాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలోగల ప్రతి ఇంటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఆగస్టు 15వ తారీకు ఉదయం ఎవరింటిపై వారిని ఎగరవేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి తేజ, ఉప సర్పంచ్ పైడి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: