CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: రాజస్థాన్ రాష్ట్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్ లో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మేగ్వాల్ ను కులతత్వంతో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ అశ్వారావుపేటలో సంపూర్ణంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నార్లపాటి సుబ్బారావు మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రంలోని జోలర్ జిల్లాలోని సురానా గ్రామంలో సరస్వతి శిశు మందిర్ స్కూల్ లో 3 వ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల దళిత బాలుడు ఇంద్ర కుమార్ మేగ్వాల్ అందరూ విద్యార్ధులు తాగే మంచి నీళ్ళ కుండలోని నీళ్లు త్రాగాడనే నెపంతో ఆ స్కూల్ టీచర్ చైల్ సింగ్ అమానుషంగా అత్యంత కిరాతకంగా కొట్టి దారుణంగా హింసించడం జరిగిందని, దాంతో ఆ బాలుడిని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే 24 రోజుల పాటు చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి ఆగస్టు 14 వ తేదిన మరణించాడు. ఈ సంఘటన మన దేశంలో మానవత్వమున్న ప్రతి మనిషి హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. స్కూల్లో అందరూ తాగే నీళ్లను తాగే స్వేచ్ఛ కూడా దళితులకు లేదంటే ఈ దేశ కుల వ్యవస్థ, అంటరానితనం ఇప్పటికి దళిత ప్రజలను ఎంత హింస పెడుతున్నదో అర్థం చేసుకోవాలి. 75 ఏండ్ల స్వాతంత్య్ర వజోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అంటరానితనం దళిత బాలుడిని హత్య చేస్తే మన దేశ ప్రధానమంత్రి ఈ రోజు వరకు ఖండించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హత్యకు గురైన దళిత బాలుడి పట్ల దేశ ప్రధానమంత్రికే సానుభూతి లేకపోతే, అంటరాతనితనాన్ని పాటిస్తున్న కులోన్మాదులకు ప్రధానమంత్రి హెచ్చరిక చేయకపోతే దళితుల మీద అకృత్యాలు ఎట్లా ఆగుతాయని, కనీసం మానవత్వం లేకుండా ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరు దళితులను మరింత మనోవేదనకు గురి చేస్తుందన్నారు. దళితుల మీద దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, ఇంద్ర మేగ్వాల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుండి 22 వరకు జాతీయ స్థాయిలో వివిధ రూపాల్లో నిరసన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ఈ ఉద్యమంలో భాగంగా ఇంద్ర మేగ్వాల్ కూడా విద్యార్థి గనుక ఆగస్టు 23 న విద్యా సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని, సహకరించిన వారందరికీ ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఉపాధ్యక్షుడు అయినంపూడి నాగరాజు, గౌరవ సలహాదారుడు గాలoకి అశోక్, నార్లపాటి రాంబాబు, నార్లపాటి భీమయ్య మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: