మన్యం టీవీ దుమ్ముగూడెం ::
శ్రావణమాసం ఆఖరి మంగళవారం సందర్భంగా దుమ్ముగూడెం గ్రామంలోని వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు శ్రావణమాసం ఆఖరి మంగళవారం కారణంగా ఆలయ కమిటీ సభ్యులు గత వారం రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రచారం నిర్వహించారు ఆడపడుచులకు ఆలయ కమిటీ తరఫున పసుపు కుంకుమ గాజులు జాకెట్ అమ్మవారి ప్రసాదం అందించారు ఈ కార్యక్రమం కి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చుక్క గణేష్ రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: