మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు జరపతలపెట్టిన ధర్నా, రాస్తారోకో, నిరసన, కలెక్టర్ రేట్ ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలో ని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున ములుగు జిల్లాకేంద్రానికి తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గురువారం ఓ ప్రకటన లో పిలుపునిచ్చారు.
ఏ.ఐ.సి.సి ఆదేశాల మేరకు టి.పి.సి.సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపు తో ఆగష్టు 5వ, తారీఖున బిజెపి ఆధ్వర్యంలో ని కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు నిత్యం పెంచుతూ,దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతూ, పాలు, పెరుగు, నూనెలు,పప్పు, ఉప్పుతో పాటు గ్యాస్, డిజీల్ , పెట్రోల్ తో పాటు ఇతర నిత్యావసర సరుకుల పై విధిస్తున్న జి.ఎస్.టి ధరలను నిరసిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు నియోజకవర్గo లోని అన్ని మండలాల నుండి ములుగు కేంద్రంలో జరగబోయే ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధి లు,
కిసాన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్,ఐ.ఎం.టి.యూ.సి తో పార్టీ ఇతర అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ భాగస్వామ్యం అయ్యి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Post A Comment: