- పోడు హక్కుకై పోరాడుదాం..
- అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులందరికీ పోడు పత్రాలు ఇవ్వాలి..బిజెపి గిరిజన మోర్చా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ ..
మన్యం టీవీ చర్ల/దుమ్ముగూడెం ::
పోడు భూముల పట్టాల కోసం పోరాటం చేద్దామని పోడు భూముల రైతులతో చర్ల బిజెపి మండల ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు మండలంలోని తిప్పాపురం పంచాయతీ పరిధిలోని చెలిమెల గ్రామంలో పోడు రైతులతో రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ భూములను పరిశీలించి పోడు హక్కులకై పోరాటం చేదాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సంరక్షణ పర్యావరణ సమతుల్యత ఆదివాసీల మీద ఆధారపడి ఉన్నదని అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం ఆదివాసీలందరికీ పొడు హక్కు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అలానే సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ పోడు భూముల సమస్యలు ఉన్న ప్రతి నియోజకవర్గానికి వచ్చి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఊసే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు పోడు రైతుల దగ్గర దరఖాస్తులు స్వీకరించి కాలయాపన చేయడం తప్ప చేసింది ఏమి లేదని ఆదివాసులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పోడు రైతులు పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో పోడు కై పోరు ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూపా రమేష్, మండల మాజీ అధ్యక్షులు రమణ బీసీ మోర్చా వెంబడి హరినాథ్, కిషన్ మోర్చా సుబ్బారావు, ధర్మరాజు, బాబా పహిం, చెలిమెల గ్రామ కమిటీ సోయం రమేష్, గోవింద్, సుబ్బారావు తదితరులు.
Post A Comment: