జూలూరుపాడు ఆగస్టు 1, (మన్యం మనుగడ ప్రతినిధి) ప్రపంచవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండల పరిధిలోని మాచినేనిపేట తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ లావుడ్యా భారతి, లాకావత్ గిరిబాబు దంపతుల ఆధ్వర్యంలో పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 32 మంది ఆటో డ్రైవర్లు కు సోమవారం శాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. అనంతరం స్వీటు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ లకావత్ బుజ్జి, ఎంపీటీసీ బానోత్ నీలా, పంచాయతీ గుమస్తా మూడు రమేష్, గ్రామ పెద్దలు లకావత్ రెడ్డి, లకావత్ నాగేశ్వరరావు, లకావత్ శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: