జూలూరుపాడు ఆగస్టు 1, (మన్యం మనుగడ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని పడమట నర్సాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన సంఘటన విధితమే ఈ సంఘటనపై అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రూపాదేవి సోమవారం విచారణ చేపట్టారు. విద్యార్థులను జరిగిన సంఘటన గురించి పలు రకాలుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పిఈటి నాగమణి విద్యార్థులను కొట్టింది వాస్తవమేనని అన్నారు. ఈ నివేదికను పై అధికారులకు సమర్పిస్తామని, పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలిపారు. విద్యార్థుల యూనిఫామ్ టీచ్చింగ్ దశలో ఉన్నందున అందించలేదని, మరో నెల రోజుల్లో అందరికీ అందిస్తామని తెలిపారు. విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిన పీఈటి నాగమణిని విధుల నుంచి తొలగించాలని ఎస్ ఎఫ్ ఐ ఏ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఆశ్రమ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. పీఈటి పై చర్యలు తీసుకొని వెడల మరోసారి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆశ్రమ పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
Navigation
Post A Comment: