మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :భద్రాచలం గోదావరి వరద ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన గ్రామాల్లో తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందించిన వైద్యులకు, సిబ్బందికి స్టాప్ నర్స్ శంకరమ్మ సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్యులకు ఎన్ని సమస్యలు ఉన్న అవన్నీ పక్కనపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు మేము సైతం ఉన్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడంలో వైద్యుల పాత్ర అమోఘమన్నారు. ఒకానొక సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడటంలో వైద్యులు వైద్య సిబ్బంది పాత్ర ఎనలేనిదన్నారు. అలాంటి వారిని ఇలా సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం వరద ప్రాంతాలల్లో వైద్య సేవలు అందించిన డిడిఓ డాక్టర్ గడ్డం చేతన్, డాక్టర్ వెంకట ప్రకాష్, హెల్త్ సూపర్వైజర్ ఇమామ్, హెచ్ వి చంద్రకళ, పద్మా, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, లను శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఫార్మా సిస్టర్ లక్ష్మి, ఎల్ టి కిరణ్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: