మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: అక్రమంగా పశువులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ ని పట్టుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం బ్లూ కోడ్ పోలీసులు చండ్రుగొండ నుండి జూలూరుపాడు వెళ్లే మార్గం మధ్యలో చండ్రుగొండ ఊరు బయట వాహనాలు తనిఖీ చేస్తుండగా జూలూరుపాడు వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ TS07UE9058 నెంబర్ గల వ్యాన్ ఆపకుండా వెళ్తుండగా వ్యాన్ ను వెంబడించడంతో వ్యాన్ డ్రైవర్ లంకల వాగు ముత్యాలమ్మ గుడి వద్ద డీసీఎం వ్యాన్ ను వదిలివేసి ప్రక్కనే ఉన్న పొలాలలోకి పారిపోయాడు. వెంటనే బ్లూ కోడ్ పోలీసులు అప్రమత్తమయ్యి వ్యాన్ ని పరిశీలించిగా అందులో 50 పశువులు ఉన్నట్లు ఎస్సై విజయలక్ష్మి తెలిపారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీసీఎం వ్యాన్ ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి గోశాలకు తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో బ్లూ కోడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: