CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ ప్రతిభ స్కాలర్షిప్ కు ఎంపికైన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ప్రతిభా స్కాలర్షిప్ కు ఎంపికైన దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ కు  ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందిస్తుంటారు దీనిలో భాగంగా ఎంపికైన విద్యార్థులకు డిగ్రీ చదువుకు మూడు సంవత్సరాలుగాను ఏడాదికి 10000 రూపాయలు చొప్పున 30000 అలానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు సంవత్సరాలుగా 40 వేల రూపాయలు మొత్తం 70 వేల రూపాయలు దుమ్ముగూడెం కళాశాల నుంచి ఎంపికైన ముగ్గురు విద్యార్థులకు అందిస్తారు అని  ఇందులో భాగంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన పూనెం  దీపిక, రామినేని యశ్విత, యడ్ల గాయత్రి దుమ్ముగూడెం కళాశాల నుంచి ఎంపికవడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల నుండి పోటీ పరీక్షల్లో ఇప్పటికే ఎన్నో గొప్ప విజయాలు పిల్లలు సాధించారని దీనికి మాకు చాలా గర్వకారణం ఉందని అలానే విద్యార్థులను కాలేజీ మీద నమ్మకంతో చేర్పిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నడిపిస్తున్నామని కావున పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంకా అడ్మిషన్లు జరుగుతున్నందున తెలుగు ఇంగ్లీష్ మీడియం చేరుటకు అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: