CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విఆర్ఏ నిరవధిక సమ్మె లో భాగంగా 31వ రోజు భిక్షాటన చేసిన విఆర్‌ఏలు

Share it:

మన్యం మనుగడ, అశ్వారావుపేట: డిమాండ్ల సాధనకోసం వీఆర్‌ఏల నిరవధిక సమ్మె బుధవారానికి  31వ రోజు చేరింది. ఈ సందర్భంగా తమ నిరసన కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట మండలంలోని  స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పిలుపు మేరకు తమ డిమాండ్ల ఆకాంక్షను రహదారిపై భిక్షాటన చేస్తూ వీఆర్‌ఏలు నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అప్పటివరకు సమ్మె కొనసాగుతుందని, ఉద్యోగ భద్రత పే స్కేలు అమలు చేసిన 55 ఏళ్లు నిండిన వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు అందించి, అర్హులైన వారికి పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు జై నాగేశ్వరరావు, ఉకే రమేష్, ఎస్ రాము, చిలక రావు, శీను, ఏసు, రామారావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాణి, నాగలక్ష్మి, భవాని, చిట్టెమ్మ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: