మన్యం టీవీ - దుమ్ముగూడెం ::
మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మరియగూడెం మాజీ ఉపసర్పంచ్ సోయం వీరస్వామి మరణించడం సిపిఎం పార్టీకి తీరని లోటని ఒక పోరాట యోధున్ని కోల్పోయామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పార్టీ జెండాతో పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1990 నుండి తను సిపిఎం పార్టీ సభ్యత్వం తీసుకొని అతి తక్కువ కాలంలో రైతు సంఘం మండల కమిటీ నాయకునిగా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యునిగా పని చేశారని మరి గూడెం పంచాయతీ పరిధిలో అనేకమంది పేద ప్రజలకు పెన్షన్లు రేషన్ కార్డు ఇప్పించి ప్రజాసేవలో ముందుండి పోరాటం చేసేవారని ఇలాంటి మహా నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏ జె రమేష్, మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు ఎం బి నర్సిరెడ్డి, ఎలమంచి వంశీకృష్ణ, కోటేశ్వరరావు, చంద్రయ్య రాజమ్మ మండల కమిటీ సభ్యులు సూర్యచంద్రరావు శ్రీను బాబు కాక కృష్ణ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్ స్థానిక సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: