- సీజనల్ వ్యాధులపై అత్యవసర సమావేశం నిర్వహించిన మండల స్పెషల్ ఆఫీసర్, సర్దార్ సింగ్
- మన్యం మనుగడ/ వాజేడు: ఆగస్టు 3:మండల కేంద్రంలో సీజనల్ వ్యాధులపై పలు శాఖల అధికారులతో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన మండల స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్
- సీజనల్ వ్యాధులపై అప్రమత్తం, ప్రజలకు అవగాహన
మన్యం మనుగడ/ వాజేడు, ఆగస్టు 3 : ఇప్పటికే పలు గ్రామాలవ్యాప్తంగా జ్వర సర్వే పూర్తి వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయని, అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ వైద్య అధికారులకు, ఏఎన్ఎం లకు, ఆశ వర్కర్లకు, సూచించారు. గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని గ్రామాలలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని అన్నీ గ్రామ పంచాయతీలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలను వాయిస్ రికార్డుతో మైకు సౌండ్ ద్వారా గ్రామాలలో సాయంత్రం వేళ పంచాయతీ సిబ్బందితో గ్రామాలలో ప్రచారం చేయాలని అన్నారు. ప్రధానంగా వైద్య అధికారులు డాక్టర్స్, ఏఎన్ఎం, కార్యకర్తలు, చురుకైన పాత్ర పోషించవలసిందిగా, ప్రజల కు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధానంగా గ్రామాలలో పరిశుభ్రత చేయవలసిన బాధ్యత సెక్రటరీలకు ఉంటుంది. గ్రామాలలో పాగింగ్ చేయడం బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయడం, దోమల మందు పిచికారి చేయడం, ఫ్రైడే డ్రై డే నిర్వహించడం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గూడూరు లక్ష్మణ్, ఎం పి ఓ శ్రీకాంత్, డాక్టర్స్, ఏ ఎన్ఎమ్స్ పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: