మన్యం మనుగడ ప్రతినిధి - చండ్రుగొండ :
ఎస్సీ బాలుర వసతి గృహానికి డ్రైనేజి నిర్మాణం కోసం రూ.2 లక్షలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి.వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక బాలుర వసతి గృహానికి ఆయన ఆకస్మికంగా సందర్శించారు. భారీ వర్షానికి హాస్టల్ లోకి వచ్చిన వర్షపు నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహానికి మొత్తం శానిటేషన్ చేయడంతోపాటు, బ్లీచింగ్ చెల్లిస్తామన్నారు. పంచాయతీ అధికారుల సహాయంతో మురుగు నీటిని శుభ్రం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిపి సెక్రెటరీ ఉపేందర్, వార్డెన్ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: