మన్యం మనుగడ వాజేడు ఆగస్టు 9, ములుగు జిల్లా వాజేడు మండలం లోని అన్ని గ్రామాల్లో ఆదివాసీ గుడెలల్లో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు గణంగా జరుపుకున్నారు గ్రామాలలో గ్రామ పెద్దలతో పాటు ఆదివాసి సర్పంచులు ప్రజా ప్రతినిధులు యువకులు కలిసి కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మండల కేంద్రంలో కొమరం భీమ్ వద్ద జెండా ఆవిష్కరణ జరిగింది మండల కేంద్రము తో పాటు టేకులగూడెం, కృష్ణాపురం, చండ్రుపట్ల, పేరూరు, చింతూరు, చెరుకూరు, పెద్దగొల్లగూడెం, చీకుపల్లి, గుమ్మడిదొడ్డి, దూలాపురం కొంగాల మురుమూరు, ఏడుజర్లపల్లి, పూసూరు, గ్రామాల్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకున్నారు వాజేడునాగారం ఆదివాసీ గ్రామ పెద్దమనిషి ఎట్టి సమ్మయ్య జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసి పెద్దలు ఆదివాసి ప్రజా ప్రతినిధులు ఆదివాసి సంఘాల నాయకులు యువకులు ఆదివాసి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు వాజేడు మండల కేంద్రము లో జడ్పిటిసి తల్లాడి పుష్పలత ఎంపీపీ శ్యామల శారద సర్పంచులు పూసం నరేష్ కుమార్ వాసం మల్లేశ్వరి తల్లడి ఆదినారాయణ వాసం కృష్ణవేణి పాయం జయలక్ష్మి ఎంపీటీసీలు గొంది రమణారావు వివిధ పార్టీల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి విక్రాంత్ నాయకులు ఎల్లయ్య తల్లడి నానబాబు కుల సంఘాల నాయకులు దబ్బగట్ల లక్ష్మయ్య ఎట్టి విద్యాసాగర్ బోదెబోయిన సురేష్ గొంది కామేశ్వరరావు ఉద్యోగ సంఘాల నాయకులు ఎంజ సత్యనారాయణ చాట్ల ప్రభాకర్ చిచ్చడి అశోక్ ఇర్ప ప్రసాద్ బందం రవిందర్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Post A Comment: