మన్యం టీవీ దుమ్ముగూడెం ::
వరద ముంపు బాధితులకు ప్రభుత్వం నుంచి అందే పదివేల రూపాయలు సహాయం అందలేదంటూ దుమ్ముగూడెం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకు దుమ్ముగూడెం గ్రామంలో ప్రత్యేకంగా రెండోసారి సర్వే నిర్వహించి సుమారు 300 కుటుంబాలను గుర్తించారు అలానే ప్రభుత్వ సహాయం గా వారికి రెండు నెలలపాటు ఉచితంగా ఇస్తానన్న బియ్యం కందిపప్పు నిత్యవసర సరుకులు అలానే 10000 రూపాయల అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు ఆదేశించారు అయినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందకపోవడంతో ఈరోజు దుమ్ముగూడెం గ్రామస్తులు తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు ఎంపిటిసి ఎలమంచి వంశీకృష్ణ సిపిఎం సీనియర్ నాయకులు చంద్రయ్యతో గ్రామస్తులు కలిసి డిప్యూటీ తాసిల్దారు ప్రతాప్ వినతి పత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వేముల వెంకటేశ్వరరావు సింగరయ్య రెడ్డి కమలాదేవి గజలక్ష్మి సాయి భరత్ బుజ్జి రాజేశ్వరి సీత వీరమ్మ మంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: