CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వంట వార్పుతో నిరసన తెలిపిన విఅర్ఏలు.8వ,రోజు నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన జడ్పిటిటి కొమరం.కాంతారావు

Share it:


మన్యం మనుగడ కరకగూడెం:గ్రామ రెవిన్యూ సహాయకులకు అసెంబ్లీలో ఇచ్చిన హామలు చెయ్యాలని గ్రామ రెవిన్యూ సహాయకులు(విఅర్ఏలు)చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగానే 8వ రోజు వంట వార్పు చేపట్టారు.ఈ కార్యక్రమానికి కరకగూడెం జడ్పిటిసి కొమరం కాంతారావు హాజరై సంఘిబావం తెలిపారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విఅర్ఏలు 14,15 సంవత్సరాల నుండి గౌరవ వేతనం మీద పినిచేస్తున్నారని,గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అన్ని రకలుగా రెవిన్యూ సమస్యలను ప్రజలలోకి తీసుకెళ్ళెందుకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారని,వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ లె ఎక్కువగా ఉన్నారు అన్నారు.ప్రస్తుతం పెరిగి ధరలకు అనుగుణంగా కుటుంబాలను ఎలా పోషించాలో తెలియని స్థితిలో ఉన్నారని అన్నారు.వీఆర్ఏలకు పే-స్కెల్ అమలు చేస్తామని అర్హులైన విఅర్ఏలకి పదోన్నతులు ఇస్తామని రెండేళ్ళ క్రితం అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామి నెరవేర్చలని అన్నారు.ఈ కార్యక్రమంలో విఅర్ఏలు మదు,పుల్లయ్య,శ్రీను,వెంకటేశ్వర్లు, వెంకటమ్మ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: