మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : మండల కేంద్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం ర్యాలీని ఎస్ఐ గొల్లపల్లి విజయలక్ష్మి ప్రారంభించారు. తహసిల్దార్ కార్యాలయం నుండి ప్రధాన సెంటర్లో వరకు భారీగా ఫ్రీడం ర్యాలీని నిర్వహించారు. కేబీజీవి విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఫ్రీడం ర్యాలీలో పాల్గొని జాతీయ నినాదాలు చేశారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులు క్రీడలు ఆడి ఫ్రీడం ర్యాలీని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బానోత్ పార్వతి, తహసీల్దార్ వర్ష రవికుమార్, ఎంపీడీవో అన్నపూర్ణ, ఈఆర్డిఓ తులసీరామ్, ఎంఈఓ సత్యనారాయణ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంత కుమారి, జెడ్పిఎస్ఎస్ హెచ్ఎం ఆనంద్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు భూపతి శీను, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: