CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో స్వచ్ఛంద సంస్థల, విద్య సంస్థల మరియు ప్రెవేట్ సంస్థల ఆధ్వర్యంలో 350 అడుగులు తీవర్ణ పతక ర్యాలీ.

Share it:

 



  •  మేముసైతం అంటూ పెద్ద ఎత్తున మహిళలతో దేశ భక్తి ని చాటి చెప్పిన దిశ పౌండేషన్ సభ్యులు
  • ర్యాలీ లో పాల్గొన్నా..జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి, మండల అధ్యక్షురాలు ఎండి రహీన బేగం 


మన్యం మనుగడ, అశ్వారావుపేట:విద్యార్థి దశ నుంచే విద్యార్థులు దేశభక్తిని పెంచుకోవాలని దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి అన్నారు. అశ్వారావుపేట మండలంలో శనివారం ప్రభుత్వ శాఖలు సమన్వయంతో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో 75 వ స్వతంత్ర దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మూడు వందల యాభై అడుగుల తీవర్ణ పతకాన్ని అశ్వారావుపేట లో గల అన్ని విద్య సంస్థల విధార్థుల సంహారం తో 75 ఏళ్ల విజయోత్సవ ర్యాలీని ఏర్పాటు చేసారు. భారీ జాతీయ పతాక ప్రదర్శన పురవీధుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. అంత పెద్ద తీవర్ణ పతకాన్ని చూడడానికి వాడ వాడల ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి దేశ భక్తి ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు అయిదు వేలమంది మండల ప్రజాప్రతినిధులు అశ్వారావుపేట పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలు అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తి ని చాటుకున్నారు. యువభారత్ శక్తి, వాసవి క్లబ్, లైన్స్ క్లబ్, దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్, సహాయ సహకారాలతో పట్టణ రింగురోడ్డు నుండి మొదలయిన ఈ కార్యక్రమం రంగ రంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరై వారికున్న దేశ భక్తిని చాటుకున్నారు.

Share it:

TS

Post A Comment: