CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వతంత్ర భారత 75వ వజ్రోత్సవ "ఫ్రీడం రన్"..

Share it:

 


జూలూరుపాడు ఆగస్టు 11, (మన్యం మనుగడ ప్రతినిధి) స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో, ప్రజా భాగస్వామ్యంతో గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక ఎంపీడీవో కార్యాలయము నుండి పోలీస్ స్టేషన్ వరకు 2కే ఫ్రీడం రన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను చేత పట్టి "భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, తహశీల్దార్ లూధర్ విల్సన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్సై గణేష్, ఎంపీడీవో రవి, ఎంపీఓ రామారావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు, వైద్యాధికారి శ్రీధర్, పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి బద్దులాల్, ఎంఈఓ వెంకట్, ఐకెపి ఏపీవో సత్యనారాయణ రాజు, విజిఎస్ ఏపీవో సుహాసిని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, గిరిబాబు, సర్పంచులు, గుండెపిన్ని విజయ, గలిగే సావిత్రి, లాకావత్ భారతి, బానోత్ నరసింహారావు, బానోత్ శాంతి లాల్, భూక్య రాములు, ముక్తి నరసింహారావు ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, వివిధ సంఘాల నాయకులు, విలేకరులు, వివిధ శాఖల సిబ్బంది. రేషన్ డీలర్లు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: