- అత్యధిక సంఖ్యలో పాల్గొన్న మండల ప్రభుత్వ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారులు .
ములకలపల్లి :(ఆగష్టు11)మన్యం మనుగడ ప్రతినిధి:
75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం పోలీస్ శాఖ ఆధ్వర్యం లొ మండలం లొ 2కె రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండాతో ఉత్సాహంగా మండలంలోని అన్ని శాఖల అధికారులు,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,అంగన్వాడి ఉపాధ్యాయులు,విద్యార్థినీ, విద్యార్థులు,ప్రజా ప్రతినిధులు, నాయకులు, పెద్దలు,చిన్నారులు, అధికసంఖ్యలో పాల్గొన్నారు.మండలం లోని పలు గ్రామ పంచాయితీల్లో జగన్నాఫపురం,సీతరాంపురం, కొత్తగంగారం,సీతాయిగూడెం,పంచాయితీల్లో 2కె నిర్వహించారు.ఈ కార్యక్రమం లొ ఎస్ ఐ సురేష్, తాసీల్దార్ వీరభద్రం, ఎంపిడివో చిన్న నాగేశ్వర రావు,ఎంపివో లక్ష్మయ్య, ఏపీఎం రవీంద్ర,ఎంపిపి మట్ల నాగమణి, వైస్ ఎంపిపి పుల్లారావు,ములకలపల్లి సర్పంచ్ బీబీనేని భద్రం,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్,యూసఫ్,రామ్మోహనరావు,ములకలపల్లి, మాదారం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని 75 వ వజ్రోత్సవ వేడుక లను ఘనంగా నిర్వహించారు.
Post A Comment: