మన్యం మనుగడ కరకగూడెం:స్వతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఫ్రీడమ్ రన్ లో ఉత్సాహంగా పాల్గొన్న స్థానిక ఎంపీపీ రేగా కాళికా, తహశీల్దారు ఉషా శారద, ఎస్ఐ.నాగబిక్షం,ఎంపీఓ.రాజేందర్ ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కరకగూడెం తహశీల్దారు కార్యాలయం నుండి విరపూరం క్రాస్ రోడ్డు వరకు సుమారు 3 కిలోమీటర్ల మేరకు జాతీయ జెండా పట్టుకోని భారీ ర్యాలీ చేసి విరపూరం క్రాస్ రోడ్డు వద్ద దేశ భక్తితో చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు విన్యాసాలు చేసారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత జెండా గర్వకారణం భారతీయులు అందరూ గౌరవించే పతకం అన్నారు.అలాగే 75 సం,,పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరి ఇళ్లలో త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటుకోవం గర్వంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో లో చిరుమళ్ళ ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్ పీఈటి వట్టం.సంపత్ కేజీవిబి పాఠశాల ఎస్ఓ రమాదేవి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, గ్రామపంచాయతి సెక్రెటరీ లు,అదికారులు సర్పంచ్ లు విద్యార్థులు, యువకులు పాత్రికేయులు పాల్గొన్నారు.
Post A Comment: