గుండాల ఆగస్టు 4(మన్యం మనుగడ) గుండాల తాసిల్దార్ కార్యాలయానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. గత నెలలో గుండాల పర్యటనలో ఆయన శిథిలావస్థలో ఉన్న తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఎప్పుడు కూలుతుందో అన్న భయంతో అధికారులు విధులు నిర్వహిస్తున్నారని గమనించిన ఆయన తక్షణమే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి నిధులను మంజూరు చేయించారు అడిగిన వెంటనే స్పందించి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని రేగా పేర్కొన్నారు
Navigation
Post A Comment: