మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామంలో ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఉందని, ప్రభుత్వం అధికారికంగా ఆదివాసి దినోత్సవాన్ని జరపాలని కోరారు.ప్రతి ఆదివాసి గూడెంలో ఆదివాసి జండా ఎగరవేసి ఘనంగా ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఆదివాసి ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘ డివిజన్ అధ్యక్షులు పోలె బోయిన అనిల్ కుమార్, కొమరం కేశవరావు, కొమరం రామారావు, గొగ్గల కన్నయ్య, తోలెం జంపన్న, కొట్టెం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: