మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని కూనవరం గ్రామపంచాయతీలో శుక్రవారం సర్పంచ్ ఏనిక. ప్రసాద్ సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టడంలో భాగంగా ఫ్రైడే,డ్రై డే కార్యక్రమాన్ని కూనవరం ఎన్టీఆర్ నగర్,రేగుల గండి ఏరియాలో ముమ్మరంగా నిర్వహించడం జరిగింది.ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క ఇంటి ఆవరణంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించి, పాత్రలో నీళ్లు నిలువ లేకుండా చూడాలని,సీజనల్ వ్యాధులు, డెంగ్యూ,మలేరియా బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా మీరు మీ ఇంటి ఆవరణంలో చుట్టుపక్కల నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించడం జరిగింది.అలాగే నీరు నిలవ ఉండటం వలన,వారం రోజులలో ఆ నీటిలో లార్వా తయారై దోమలుగా వ్యాప్తి చెంది వాటి ద్వారా మనకు విష జ్వరాలు వస్తాయని వారికి వివరించడం జరిగింది.సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు పాటిస్తూ,ప్రజలెవరు అనారోగ్యం బారిన పడకూడదని,తెలియజేశారు.ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు,జిపి సిబ్బందితో ప్రతి ఇంటికి ప్రతి వీధిలో మహిళల కు అవగాహన కల్పించడం జరిగింది.అలాగే వారి యొక్క వీధులలో నీరు నిలవ ఉన్న చోట దోమలు వ్యాప్తి చెందకుండా టీమాపాస్ ను చల్లడం,అలాగే ఎక్కువ నీరు బయటకి వెళ్లకుండా ఉండే ప్రదేశాలలో గుంటలలో ఆయిల్ బాల్స్ ను వేయడం జరిగింది.అలాగే పలు వీధులకు బ్లీచింగ్ చల్లించడం జరిగింది.
అనంతరం ఏఎన్ఎం,ఆశ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారితో సీజనల్ వ్యాధులను అరికట్టే బాధ్యత మన అందరిదీ అని,కాబట్టి మీరు మీ ఏరియాలలో ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటిని తనిఖీ నిర్వహించాలని,ప్రజలందరూ జ్వరాల బారిన పడకుండా అనునిత్యం వారిని పరిరక్షించాలని అన్నారు,మన గ్రామ పంచాయతీలో ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా చూడాలని వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత మీదేనని వారికి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎన్నిక ప్రసాద్, ఉప సర్పంచ్ ఎస్కే బాజీ, ఏఎన్ఎం హెచ్ లక్ష్మి, ఐ పగడమ్మా,ఆశా వర్కర్లు ఎం కుమారి,కె విజయ,సమ్మక్క సిబ్బంది రాములు,వెంకన్న, నాగేశ్వరరావు,ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: