గుండాల/ఆళ్లపల్లి ఆగస్టు 18(మన్యం అమనుగడ) ఘనంగా సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు మర్కోడ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గౌడ్స్ నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ఉత్సవాలకు స్థానిక ఎంపీపీ మంజు భార్గవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆనాటి మొగల్ అరాచక పాలనకు వ్యతిరేకంగా మొగల్ సైన్యంపై యుద్ధం చేశారన్నారు. ఏజెన్సీలో ఎన్నో ఏళ్లుగా ఆధారపడి జీవిస్తున్న గౌడ కులస్తులకు ఇవ్వాలని ఎల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. గౌడ కులస్తులకు పెన్షన్ తో పాటు ఆర్థికంగా సైతం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి వెంకన్న, రామ్మూర్తి, నారాయణ, నగేష్ , రాంబాబు, వెంకన్న, తెలగాని శ్రీను, రవి, నవీన్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: