వాజేడు మండలంలోని ఏడుజర్లపల్లి గ్రామంలోని ఏడుజర్లపల్లి (జడ్) సర్వేనెంబర్ 76/2,భూమిలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఎనిమిది మందికి జమీందార్ వ్యవస్థ నుండి రావలసిన భూమిని ఒక్క కుటుంబానికి సంబందించిన వ్యక్తులు ఆక్రమించుకొని,భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఆక్రమించుకొని సాగుచెసుకుంటున్నారు.మాదిగ హక్కుల పరిరక్షణ సమితి మండల అద్యక్షుడు చెన్నం.వెంకటేష్ ఆద్వర్యంలో మిగతా ఏడు కుటుంబాలకు న్యాయం చేయాలని,ఇట్టి విషయాన్ని గురువారం వాజేడు రెవిన్యూ ఆర్ ఐ. కీసరి.రాజు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చెన్నం.మోహన్ రావు,కడారి.లక్ష్మయ్య,మామిడి.నాగేష్,కర్ని.పోశాలు,కడారి.బక్కులు,చెన్నం.పాపారావు,సమ్మయ్య,లక్ష్మయ్య,చెన్నం.ప్రశాంత్,రోషయ్య,సుగుణ,లక్ష్మి,మామిడి.దావీద్ .చంద్రమ్మ. రమదేవి.లక్ష్మి .రామక్క. తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: