CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తుడుందెబ్బ నూతన కార్యవర్గం ఎన్నిక.ఆదివాసి హక్కుల సాధనకై పోరాడుదాం!

Share it:

 



మన్యం మనుగడ/వాజేడు: ఆగస్టు 18: ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నూతన మండల కమిటీని గురువారం మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ హనుమాన్ కాలనీలో ఎన్నుకున్నారు.తుడుందెబ్బ డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కమిటీ ఆదివాసి చైతన్య 

సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కమిటీ, గ్రామ కమిటీ, మండల కార్యదర్శి, తోర్రెం సంతోష్, సహాయ కార్యదర్శిగా, గొడ్డే అనిల్ కుమార్, గ్రామ అధ్యక్షులుగా, తల్లడి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మనోజ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి, పాయం జానకి రమణ మాట్లాడుతూ..ప్రపంచం ఆదివాసీలరా..ఏకంకండి.ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆదివాసి తెగలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఆదివాసి బ్రతుకులు, జీవన విధానాలు, ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఆదివాసీల అభివృద్ధి ఉంది. ఆదివాసీలు అభివృద్ధి సాధించాలంటే సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం,ఆర్థిక చైతన్యం, ఆదివాసి ప్రజల్లో పూర్తిగా రాలేదు,దేశ ఆదివాసి ప్రజలని మార్చగలిగేది ఆదివాసి యువతరం, నవతరం, నడుం బిగించి ఒక్కొక్కరు ఒక్కొక్క కొమరం భీమ్ గా.. కొమరం భీమ్ ఆసియా సాధన కొరకు కృషి చేయాలని పేరూరు యువతరానికి నవతరానికి సూచన చేశారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజ్, జిల్లా సహాయ కార్యదర్శి మడకం చిట్టిబాబు,జిల్లా నాయకులు చిరంజీవి, జజ్జరి సత్యనారాయణ, అట్టం రఘుపతి, గ్రామ కమిటీ సభ్యులు, కురుసం మల్లికార్జున్, దుబ్బా, నర్సింగరావు, ఎం జె సంతోష్, హరీష్, దిలీప్ ,రవీందర్, అనిల్ రమేష్ సుమన్, సుధాకర్ ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: