CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహా నాయకుడు కామ్రేడ్ సున్నం రాజయ్య 2వ వర్ధంతి..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే కామ్రేడ్ సున్నం రాజయ్య రెండో వర్ధంతి ములకపాడు సెంటర్లో ఉన్న ఎలమంచి సీతారామయ్య భవనంలో నిర్వహించారు మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్ వారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు అనంతరం మర్మం చంద్రయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ కామ్రేడ్ రాజయ్య చేసిన కృషి మరువలేనిదని మూడుసార్లు భద్రాచలం శాసనసభ్యునిగా  గిరిజన, గిరిజనేతర పేద ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా పేద ప్రజల కోసం పోరాడిన నాయకుడని, ఆదివాసి హక్కుల కోసం కోయ భాషలో మాట్లాడి అందరి మన్ననలు పొందారని, మచ్చలేని నాయకుడిని స్ఫూర్తి తీసుకొని నేటితరం నాయకులు యువత పెద్ద ఎత్తున పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, మండల కమిటీ సభ్యులు ఎండి మహమ్మద్, సాయి రెడ్డి, గుడ్ల రామ్మోహన్ రెడ్డి తాతారావు కాక కృష్ణ,  లక్ష్మయ్య, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: